వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పు తేడు, చిరే మారిపోయారు: సమరం

By Staff
|
Google Oneindia TeluguNews

Samaram
విజయవాడ: మార్పు తెస్తానని చెప్పిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవే పూర్తిగా మారిపోయారని ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ సమరం వ్యాఖ్యానించారు. మేధావుల సలహా మేరకే పార్టీ పెట్టానని చెప్పిన చిరంజీవి వారినే కోవర్టులుగా, ద్రోహులుగా చిత్రించడం అన్యాయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

పార్టీ నిండా వలస పక్షులు నిండిపోయారని, వారంతా స్వార్థం కోసమే పార్టీలోకే వచ్చారని ఆయన అన్నారు. స్వార్థపరులు, పెట్టుబడీదారులు పార్టీలో నిండిపోయారని ఆయన అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన చిరంజీవి పార్టీలో అవినీతిపరులే ఉన్నారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X