కూటమికి 170 సీట్లు: టిడిపి

అధికారంలో తెరాస, వామపక్షాలు కూడా భాగస్వాములవుతాయా? అన్న ప్రశ్నకు తామంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన సమాధానమిచ్చారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఆ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతామని తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నించగా ఎవరైనా ఢిల్లీ వెళ్లొచ్చని, అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు. మహాకూటమి నేతలు కేసీఆర్, రాఘవులు, నారాయణ తదితరులు ఎన్నికల్లో బాగా సహకరించారని అభినందించారు. కార్యకర్తలు చావో రేవో అన్నట్లుగా పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలకు చంద్రబాబు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో విందు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications