డాడీ కాంగ్రెస్ లో చేరాల్సింది: త్రిషాలా
ముంబయి: తన డాడీ కాంగ్రెసులో చేరి తన తాత సునీల్ దత్ వారసత్వాన్ని కొనసాగించి ఉండాల్సిందని బాలీవుడ్ నటుడు, సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్ కూతురు త్రిషాలా అంటోంది. ఆమె సంజయ్ దత్ తీరు పట్ల, తన సవతి తల్లి మాన్యత పట్ల తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ లో చదువు పూర్తి చేసిన తర్వాత త్రిషాలాను ఇంటికి అహ్వానించి సంజయ్ దత్ కుటుంబాన్నిపరిపూర్ణం చేస్తానని మాన్యత చెప్పిన మాటలపై త్రిషాలా వ్యంగ్యంగా ప్రతిస్పందించింది. అది తన ఇల్లు అని, తన ఇంటికి తాను రావడానికి ఆహ్వానం అవసరం లేదని, తాను స్వతంత్రంగా ఉండగలనని భావించినప్పుడు తానే వస్తానని త్రిషాలా అంది.
పార్టీ ప్రచారంలో నిండా మునిగిపోయిన సంజయ్ దత్ నెల రోజులుగా త్రిషాలాతో మాట్లాడలేదు. రెండేళ్ల వరకు తాము చాలా సన్నిహితంగా ఉన్నామని, జరిగిన తప్పేమిటో కనిపెట్టడానికి ఇప్పటికే ఆలస్యం జరిగిందని, తమ సంబంధాల పట్ల తాను ఉద్వేగానికి గురి కావడం లేదన, తన డాడీ వైఖరే తనకు వచ్చిందని ఆమె అంటోంది. మాన్యత గురించి తనకు ఎక్కువగా తెలియదని ఆమె అంటోంది. తన అత్త ప్రియాదత్ తో మాత్రం త్రిషాలా ప్రతి రోజూ మాట్లాడుతోందట.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications