Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లెఫ్ట్ కు డోర్స్ ఓపెన్: లాలూ

Lalu prasad Yadav
పాట్నా: ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదని, వామపక్షాల మద్దతు అవసరమవుతుందని, వామపక్షాలకు తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. సంకీర్ష ప్రభుత్వాల యుగమే కొనసాగుతుందని, ఈ స్థితిలో వామపక్షాలు, లౌకిక శక్తులు కలవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జెడి (యు)తో కలవడానికి తమకు అభ్యంతరం లేదని సిపిఎం నేత సీతారాం ఏచూరి చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా వామపక్షాలు మతతత్వ పార్టీలతో కలుస్తాయని మీరు అనుకుంటున్నారా, నితీష్ కుమార్ మతతత్వ బిజెపి ఒడిలో కూర్చున్నారు, మతశక్తులు అధికారంలోకి రావడాన్ని వామపక్షాలు అనుతించవు అని ఆయన అన్నారు.

బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పిదమని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఆర్జెడి జాతీయ పార్టీ అని, అ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉందని, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెసుకు ఉనికి కూడా లేదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+