అన్నవరం కల్యాణ ఉత్సవాలు
అన్నవరం: అన్నవరం సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వారం రోజులపాటు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. వైశాఖ శుద్ధ దశమి లగాయితు బహుళ పాఢ్యమి వరకు వేడుకలు నిర్వహిస్తారు. మొదటిరోజు సోమవారం సాయం త్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసి ఏడు గంటలకు రత్నగిరిపై రాజరామరాయ కళామందిరంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇందుకోసం కళా మందిరానికి వివిధ రంగులు అద్దారు. ఈ వారం రోజులపాటు స్వామివారి వెండి వాహనా లపై ప్రతిరోజూ గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై గ్రామం నలువీధుల్లోనూ ఊరేగించ నున్నారు. స్వామివారి కల్యాణానికి గ్రామస్తులను ఆహ్వానించేందుకు ప్రతీకగా ఈ ఊరేగింపు నిర్వ హిస్తారని దేవస్థానం పండితులు పేర్కొన్నారు. రెండవ రోజున సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మ వార్లను వెండి గరుడ వాహనంపైనా సీతారా ముల ను వెండి గజవాహనంపైనా మేళతాళాలు, వేద పండితుల వేద ఆశీర్వచనాల నడుమ ఊరేగిస్తారు.
రాత్రి 9.30 గంటలకు కొండపైన సర్వాంగ సుం దరంగా అలంకరించిన శాశ్వత కల్యాణ వేదికపై కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహిస్తారు. మూడవ రోజున స్వామి అమ్మవార్లను రావణ వాహనం, నాల్గవరోజు పొన్న వాహనం, ఐదవ రోజున వెండి రథంపై ఊరేగింపు నిర్వహించి ఆరవరోజున స్వామి అమ్మవార్లకు పవి త్ర పంపా సరోవరంలో శ్రీచక్ర స్నానం గావిస్తారు. చివరిరోజైన 10వ తేదీన శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సం దర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను చైర్మన్ రామ్ కుమార్, ఈవో ఎస్.కొండలరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా సత్యప్రభను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications