ఎమ్మెల్యేల కట్టడికి పార్టీల శిబిరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రావచ్చుననే అంచనాలు నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిచిన అభ్యర్థులను కట్టడి చేయడం ఎలా అనే మీమాంసలో పడ్డాయి. శాసనసభకు ఎన్నకయ్యే అభ్యర్థులు జారిపోకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ముందస్తు చర్యలకు ఒడి గట్టారు. ఇతర పార్టీల నేతలు తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టవచ్చునని ఎవరికి వారే భయపడుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 16వ తేదీ లోగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నెల 14వ తేదీ నుంచే ప్రజారాజ్యం పార్టీ క్యాంపు నిర్వహించడానికి సిద్ధపడింది. తమ పార్టీ మద్దతే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కావచ్చునని భావిస్తున్న తరుణంలో అభ్యర్థులు జారిపోకుండా చూడడం ప్రజారాజ్యం పార్టీకి శిరోభారమే కానుంది. హైదరాబాదుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఒక ఫామ్ హౌస్ ను ప్రజారాజ్యం పార్టీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 15వ తేదీనాటికి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకోవాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications