హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్ పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు. ఆయన ఆరు వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. చాలా కాలంగా రాజకీయాల ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న జయప్రకాష్ నారాయణ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు.