హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముసలం: ఎమ్మెల్యేలతో కెసిఆర్ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: పార్టీలో తిరుగుబాట్లు అధికం కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తమ పార్టీ తరపున ఎన్నికైన కొత్త సభ్యులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైందని, అందుకు కెసిఆర్ విధానాలే కారణమంటే పలువురు తెరాస నేతలు విడిగా సమావేశం పెట్టుకుని తాము వేరే ఉద్యమం నడుపుతామని ప్రకటించారు. ఇప్పటివరకు కెసిఆర్ కొత్త ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోవటంతో మరింత గందరగోళం ఏర్పడింది. దీన్ని తొలగించి కొత్త సభ్యులకు నచ్చజెప్పేందుకు గాను వారితో భేటీ అవాలని కెసిఆర్ నిర్ణయించారు.

కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్రనాయక్ బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ కుమారుడు రామారావు, కూతురు కవితల జోక్యం పార్టీలో పెరిగిందని తెరాస నాయకుడు మహేందర్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి జోక్యం వల్లనే ఉద్యమానికి సంబంధం లేని పది మంది ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. కెసిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X