టీఆర్ ఎస్ రెబల్ పాదయాత్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష్యుడు కెసిఆర్ తో విభేదించి విడిగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ జూన్ 7న వరంగల్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఏకనాయకత్వంలో కాకుండా సమిష్టి నాయకత్వంలో ఉద్యమాన్ని నిర్వహించాలని భావిస్తున్నందున తెలగంగాణ విమోచన సమితిని తెలంగాణ విమోచన వేదికగా మార్చాలన్న ప్రతిపాదన మెజారిటి సభ్యులు నుంచి వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమమే పరిష్కారమని తెలంగాణ విమోచన సదస్సు (టీవీఎస్) తీర్మానించింది. ఆ దిశగా టీవీఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సదస్సు ప్రతినిధి దిలీప్ తెలిపారు. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జూన్ 7 నుంచి దిలీప్ కుమార్ పాదయాత్ర చేయనున్నట్లు సదస్సు తెలిపింది.
Comments
Story first published: Monday, June 1, 2009, 12:01 [IST]