ఎక్సైజ్ చౌదరి ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీవరేజెస్ కార్పొరేషన్ డిపో మేనేజర్ సత్యనారాయణ చౌదరి నివాసంపై ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. కూకట్ పల్లిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడుల్లో కోటి రూపాయలకు పైగా అక్రమ ఆస్థులు ఉన్నట్లు గుర్తించి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన కార్యాలయంపై కూడా దాడులు చేశారు.
Story first published: Wednesday, June 17, 2009, 15:16 [IST]