ఆంధ్రప్రదేశ్ విద్యార్ధికి అంతర్జాతీయ అవార్డు
హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోబ్లెట్ అవార్డు మన రాష్ట్రానికి చెందిన విద్యార్థి రుద్రరాజు కృష్ణ శివశంకర్ కు దక్కింది. అమెరికాలో వివిధ యూనివర్సిటీలకు చెందిన 90 మంది విద్యార్థులు ఈ అవార్డుకు పోటీపడ్డారు. ఎరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్ డీ చేసిన ఐదుగురు ఫైనల్స్కు చేరగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కృష్ణశివశంకర్ ఈ అవార్డును చేజిక్కించుకున్నారు. కోనసీమ గోడిలంకకు చెందిన శివశంకర్ తల్లితండ్రులు ఆర్ వీఎస్ సుబ్బరాజు, పద్మావతి ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్వాల్ లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications