డిజిపిపై ఇసికి టిడిపి ఫిర్యాదు

ఎన్నికల కమిషన్ పైనే లేఖాస్త్రాలు సంధిస్తున్న డీజీపీ వైఖరిని ముఖ్యమంత్రి సరిదిద్దాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో సూచించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించడం లేదంటే ఆయన ప్రోద్బలం కూడా దీని వెనక ఉన్నట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసేందుకు ప్రభుత్వ అనుమతిని డీజీపీ యాదవ్ తీసుకున్నదీ లేనిదీ చెప్పాలన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు ముందు సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిందని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల్లో వారెవరూ అభ్యంతరం చెప్పలేదని, యాదవ్ మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే హక్కు డీజీపీకి లేదని వారు అభిప్రాయపడ్డారు.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications