పవన్ కల్యాణ్ కొనసాగుతాడు: చిరు

రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కొంతమంది ట్రాక్టరు, బుల్డోజరు తదితర గుర్తులు ఎంపిక చేసుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టిక్కెట్లు అమ్ముకోవడంతో పార్టీ ఓటమి పాలయ్యిందనేది గోబెల్స్ ప్రచారమనీ, తన నిజాయితీ ఏమిటో రాష్ట్ర ప్రజలకు 30 ఏళ్లుగా తెలుసన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడలేకపోవడమే ఓటమికి కారణమన్నారు. జోడుగుర్రాల స్వారీలా కాకుండా సినీరంగానికి దూరంగా ప్రజాసేవకు అంకితమవుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై డీజీపీ యాదవ్ లేఖలు రాయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా ముందుకు వెళతామనీ, ఇతర పార్టీలతో పొత్తుపై ఏమీ ఆలోచించలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications