వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయం: ఒబామా

By Staff
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: కాశ్మీర్ సమస్యపై తాము మధ్యవర్తిత్వం నెరపబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపునకు పాక్, భారత్ ల మధ్య చర్చలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ సమస్యతో కాకుండా ఇతర అంశాలపై చర్చలు ప్రారంభించాలని, దాని వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగి సంబంధాలు మెరుగవుతాయని ఆయన పాకిస్తాన్ డాన్ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలను నెరవేర్చే అంశాలపై చర్చలు మొదలు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాశ్మీర్ సమస్యపై తాము మౌనంగా ఉండడం పాకిస్తాన్ కో, భారత్ కో తాము మిత్రులు కావడం వల్లనే కాదని తాను అనుకోవడం లేదని, ఇద్దరు మిత్రులు కలహించుకోవడం తమను కలత పెడుతుందని ఆయన అన్నారు. విభేదాలు ఎలా పరిష్కరించుకోవాలనే విషయంపై తాము భారత్ ను, పాకిస్తాన్ ను ఆదేశించలేమని ఆయన చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలకు తాము సహకరిస్తాం తప్ప మధ్యవర్తిత్వం నెరపబోమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు ఉద్రిక్తతల నివారణకు మంచి మార్గమనే ఉద్దేశంతో పాకిస్తాన్ తో చర్చలు జరపాలని తాము భారత్ కు సూచించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X