బాలయ్యని అధ్యక్షుడిని చేయాలి
నెల్లూరులో విలేఖరులతో మాట్లాడుతూ స్పీకర్ వ్యవహారంలో చంద్రబాబు పొరపాటు చేశారన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని వివరించారు. మరో రెండు లేఖలు రాశాక తప్పకుండా బాబును కలుస్తానని తెలిపారు. వైఎస్ పథకాలను పొగడడం పార్టీ వ్యతిరేకం కాదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడైన బాలకృష్ణకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరినందుకే తనను సస్పెండ్చేశారని ప్రసన్న అన్నారు. తనను సస్పెండ్చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష బాధ్యతలను బాలకృష్ణకు ఇవ్వాలని కోరినందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
చంద్రబాబు తన గొంతు కోశారని ఆరోపించారు. తానిప్పటికీ టీడీసీ మరింత పటిష్టం కావాలనే కోరుకుంటున్నానని అన్నారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరే ఉద్దేశం లేదన్నారు. అయినా... నియోజకవర్గంలోని సన్నిహితులతో సమావేశమై వారి ఆలోచన మేరకు భవిష్యత్తును నిర్ణయించుకుంటానని తెలిపారు.