తలసాని తప్పు చేశారు: తీగెల
హైదరాబాద్: పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తమ పార్టీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు తీగెల కృష్ణా రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడే అవకాశం శ్రీనివాస యాదవ్ కు ఉందని, అయినా తలసాని బహిరంగ విమర్సలు చేయడం సరి కాదని ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై పార్టీ అధ్యక్షుడితో చర్చించిన తర్వాత నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు.
పార్టీ ఓటమికి కారణాలను ఈ నెల 25, 26, 27 తేదీల్లో సమీక్షిస్తున్నామని, తెలంగాణ అనుకూల వైఖరి వల్ల ఓడిపోయామా, ఇతర కారణాల వల్ల ఓడిపోయామా అనేది సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శలు కాంగ్రెసు కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. శ్రీనివాస యాదవ్ ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల తాము ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన అన్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications