హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల నాడి అందలేదు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఇటీవల ఎన్నికల్లో తాము ప్రజల నాడిని సరిగా అర్థం చేసుకోలేక పోయామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అంగీకరించారు. ప్రజారాజ్యం ప్రధాన నినాదమైన సామాజిక న్యాయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుందని ఆయన అన్నారు. గుంటూరు, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీలోకి చాలామంది వచ్చి డబ్బు బాగా ఖర్చు పెట్టినా వారికి సరైన న్యాయం జరగలేదని అన్నట్లు సమాచారం.

'నేను లేకున్నా పార్టీ కొనసాగుతుందని మీరన్నారు. ఇది సరికాదు' అని చిరంజీవికి కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తున్నామో తెలియజేసేందుకే అలా వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలని, పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల్ని సమీకరించుకోవాలని కొందరు అధ్యక్షుడికి సూచించారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారిపట్ల ఉదారంగా ఉండాలని, పార్టీ నిర్మాణంలో వారి పాత్ర కూడా ఉందని మరికొందరు నేతలు సూచించారు. దీనికి 'కొందరి పట్ల అలా ఉండలేం కదా' అంటూ చిరంజీవి సమాధానమిచ్చినట్లు తెలిసింది శాసనసభ సమావేశాల్లో బాగా మాట్లాడారని, రానున్న సమావేశాలకు మరింత కసరత్తు చేయాలని కొందరు నేతలు చిరుకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X