డిఎస్ ఎదుటే వర్గాల బాహాబాహీ
విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలోనే కృష్ణా జిల్లాలోని కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. కృష్ణా జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) సమావేశం సందర్భంగా శుక్రవారం ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సమావేశం లోపల ఒక ఘర్షణ, వెలుపల మరో ఘర్షణ జరిగాయి. సమావేశం లోపల జగ్గయ్యపేట శాసనసభా నియోజకవర్గానికి చెందిన రేపాల మోహన్ రావు, ఉదయభాను వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. జగ్గయ్యపేటలో రేపాల మోహన్ రావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లనే ఉదయభాను ఓడిపోయారని ఒక వర్గం వాదించింది. రేపాల మోహన్ రావుకు వ్యతిరేకంగా ఉదయభాను వర్గం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
సమావేశం వెలుపల నూజివీడు నియోజకవర్గానికి చెందిన మేకల ప్రకాశరావు, పాలడుగు వెంకటరావు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులకు కూడా దిగారు. తమను సమావేశం లోపలికి అనుమతించాలని పాలడుగు వెంకటరావు వర్గం పట్టుబడుతూ ధర్నాకు దిగింది. దీంతో డి శ్రీనివాస్ వెలుపలకి వచ్చి ప్రకటన చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఆయన లోనికి వెళ్లిపోయి సమావేశం పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా పాలడుగు వెంకటరావు వర్గం బందరు రోడ్డులో బైఠాయించి ఆందోళన సాగించారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications