తెరాస నేతల బహిష్కరణపై స్టే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేతల బహిష్కరణపై సిటీ సివిల్ కోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమను అకారణంగా తెరాస బహిష్కరించిందని ఆ పార్టీ అసమ్మతి నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా అసమ్మతి నేతల బహిష్కరణపై వివరణ ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టు తెరాస అధిష్ఠానాన్ని ఆదేశించింది.
తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి అసమ్మతి నేతలు ప్రయత్నించారు. వారంతా తెలంగాణ భవన్ లోకి ప్రవేశించడానికి పూనుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ పై దాడి జరగవచ్చుననే ఉద్దేశంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెనుదిరిగిన అసమ్మతి నేతలు చంద్రశేఖర్ నివాసంలో సమావేశమయ్యారు.
Comments
Story first published: Friday, June 26, 2009, 14:54 [IST]