శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోక్ సత్తాతో చర్చకు రెడీ: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: లోక్‌ సత్తా పార్టీతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇది బస్తీమే సవాల్‌ లాంటిది కాదని, వాస్తవాలపై మాత్రమే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. అసెంబ్లీలో వాకౌట్‌ కూడా చేయనన్న లోక్‌ సత్తా తమ పార్టీ కార్యాలయంపై మాత్రం చెప్పులతో దాడి చేస్తుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామారావుపై బనాయించిన కేసులు నిరాధారమైనవని తేలిపోయిందని, వైఎస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ ప్రభుత్వం ఆడపిల్లల శీలాలతో కూడా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇలాంటి దౌర్భాగ్య పనులన్నింటికీ ముఖ్యమంత్రి కార్యాలయమే కేంద్రంగా మారిందన్నారు.

శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అక్కడ ప్రజారాజ్యం వల్ల దెబ్బతిన్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో లోక్‌సత్తా వల్ల దెబ్బతిన్నామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ రెండు పార్టీలు చీల్చడంతో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరిందని అన్నారు. తమ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఈ అభిప్రాయం వ్యక్తమైందని, ఏ పార్టీలైనా విశ్లేషణ చేసుకోవడం సాధారణమని చెప్పారు. విమర్శ, ప్రతి విమర్శ ఉంటాయి కానీ, ఏనాడూ ధర్నా చేయని లోక్‌సత్తా ఏకంగా తెదేపా కార్యాలయం ముందు ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సత్తా పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? ఎంత వచ్చింది? అనేది కూడా చెప్పాలన్నారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని, ఎన్నికల ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని తాము గతంలోనే ప్రతిపాదించామని గుర్తుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X