చిరు పార్టీ రెండో ఆఫీస్ క్లోజ్

ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం 18 శాసనసభ స్థానాలకే పరిమితం కావటంతో తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ఓ-2కి వచ్చే వారు బాగా తగ్గిపోయారు. అయితే ఆ కార్యాలయం తమ వ్యాపార అవసరాలకు కావాలని తోట చంద్రశేఖర్ పార్టీకి నెల క్రితం నుంచి చెప్పసాగారు. రెండు వారాల కిందట ఒక అంతస్తును మాత్రమే పార్టీకి వదిలి మిగిలిన రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆ ఒక్క అంతస్తునూ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ కార్యాలయ కార్యదర్శి సైతం గురువారం ఓ-1కే వచ్చారు. నెలన్నర క్రితమే ఓ-2ని మూసేస్తున్నారని ప్రచారం జరగగా, చిరంజీవి జోక్యం చేసుకొని ఆ వార్తల్ని ఖండించారు. తాజాగా ఇది మూతపడుతుండటంతో ఈపరిణామం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
More From
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications