చిరు పార్టీ రెండో ఆఫీస్ క్లోజ్

ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం 18 శాసనసభ స్థానాలకే పరిమితం కావటంతో తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ఓ-2కి వచ్చే వారు బాగా తగ్గిపోయారు. అయితే ఆ కార్యాలయం తమ వ్యాపార అవసరాలకు కావాలని తోట చంద్రశేఖర్ పార్టీకి నెల క్రితం నుంచి చెప్పసాగారు. రెండు వారాల కిందట ఒక అంతస్తును మాత్రమే పార్టీకి వదిలి మిగిలిన రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆ ఒక్క అంతస్తునూ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ కార్యాలయ కార్యదర్శి సైతం గురువారం ఓ-1కే వచ్చారు. నెలన్నర క్రితమే ఓ-2ని మూసేస్తున్నారని ప్రచారం జరగగా, చిరంజీవి జోక్యం చేసుకొని ఆ వార్తల్ని ఖండించారు. తాజాగా ఇది మూతపడుతుండటంతో ఈపరిణామం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications