చిరు పార్టీ రెండో ఆఫీస్ క్లోజ్

ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం 18 శాసనసభ స్థానాలకే పరిమితం కావటంతో తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ఓ-2కి వచ్చే వారు బాగా తగ్గిపోయారు. అయితే ఆ కార్యాలయం తమ వ్యాపార అవసరాలకు కావాలని తోట చంద్రశేఖర్ పార్టీకి నెల క్రితం నుంచి చెప్పసాగారు. రెండు వారాల కిందట ఒక అంతస్తును మాత్రమే పార్టీకి వదిలి మిగిలిన రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆ ఒక్క అంతస్తునూ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ కార్యాలయ కార్యదర్శి సైతం గురువారం ఓ-1కే వచ్చారు. నెలన్నర క్రితమే ఓ-2ని మూసేస్తున్నారని ప్రచారం జరగగా, చిరంజీవి జోక్యం చేసుకొని ఆ వార్తల్ని ఖండించారు. తాజాగా ఇది మూతపడుతుండటంతో ఈపరిణామం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.












Click it and Unblock the Notifications