మన రాష్ట్రంలో మరో 8 స్వైన్ ఫ్లూలు
హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా మరో 8 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లినవారికి మాత్రమే సోకిన ఈ వ్యాధి ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన రెండవ వ్యక్తికి కూడా సోకినట్లు వైద్యులు నిర్థారించారు. ఈనెల 5న హూస్టన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకి అతనినుంచి అతని గదిలో ఉన్న 7గురు స్నేహితులకు సోకింది. వీరందరికీ ఛాతీ వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు. వీరితో ఇంతవరకు స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య 31కి చేరింది. ఇందులో 20 మంది డిశ్ఛార్జికాగా మరో 11మంది చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Monday, July 13, 2009, 17:09 [IST]