ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్నపనేనిపై రాళ్ళతో దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
ఒంగోలు: ప్రకాశం జిల్లా కారంచేడులో తెలుగు దేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిపై కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై నన్నపనేని ఏకవచనంతో వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహించిన దగ్గుపాటి వర్గీయులు,కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు నన్నపనేనిపై వ్యక్తిగత దూషణకు దిగారు. దాంతో ఆమె భోరున విలపించారు. కొందరు కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు ఆమెపై రాళ్లతో దాడి చేశారు. కొందరు నన్నపనేనిని జుట్టుపట్టి లాక్కెళ్ళారు.

ఈ దాడిలో రాజకుమారి తలకు గాయం కావడంతో ఆమె స్పహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు భారీ భద్రత మధ్య ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రాజకుమారి గన్‌మెన్‌ కూడా గాయపడ్డాడు. టీడీపీ నేత కరణం బలరాం కారుతో పాటు మరికొందరి వాహనాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన స్పెషల్‌ పార్టీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X