పోలీస్ స్టేషన్ పైకి తెగబడిన మావోలు

ఒకేరోజు...మూడు ఘటనల్లో...ఒక ఎస్పీ, ఇద్దరు ఎస్ ఐలతో సహా 38 మంది జిల్లా సాయుధ దళ జవాన్లను (డీఏఎఫ్) బలి తీసుకున్నారు. వల మీద వలవేసి మరీ వరుస దాడులు చేశారు. మందుపాతర్లతో మృత్యుఘోష వినిపించారు. ఛత్తీస్ గఢ్ రాజధానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యమంత్రి రమణ్సింగ్ సొంత నియోజకవర్గంలోనే నక్సల్స్ మారణహోమానికి పాల్పడ్డారు.
నిన్న మావోయిస్టులు చేసిన మారణ కాండ వివరాలు: ఆదివారం...తెలతెలవారుతుండగానే నెత్తుటి అధ్యాయం మొదలైంది. రాజ్ నంద్ గావ్ జిల్లాలోని మదన్వాడలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంప్ నుంచి ఇద్దరు జవాన్లు స్నానం చేసేందుకు బయటికి వెళ్లారు. అంతే...మావోయిస్టుల చేతికి చిక్కారు. వీరిద్దరినీ నక్సల్స్ కాల్చిచంపారు. అంతటితో ఊరుకోలేదు. తదుపరి దాడులకూ ప్రణాళికలు రచించారు. మదన్ వాడకు అదనపు బలగాలు తరలివస్తాయనే గట్టి నమ్మకంతో మందుపాతరలతో సిద్ధంగా కూర్చున్నారు. సరిగ్గా...వారు ఊహించినట్లే జరిగింది. నక్సల్స్ ఇద్దరు జవాన్లను చంపినట్లు తెలియగానే రాజ్నంద్గావ్ ఎస్పీ వినోద్ కుమార్ చౌబే స్పందించారు.
అదనపు బలగాలను వెంట తీసుకుని స్వయంగా మదన్వాడకు బయలుదేరారు. ఖోరేగావ్ గ్రామం దాటారు. కార్కోటీ అనే ఊరికి చేరుతుండగా... మాన్ పూర్ వద్ద ఘోరం జరిగిపోయింది. పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ రెండు శక్తివంతమైన మందుపాతర్లు పేల్చారు. పేలుళ్ల తీవ్రతకు ఎస్పీ, ఇతర జవాన్లు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. హతాశులైన జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం అవకాశమివ్వకుండానే మావోయిస్టులు మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎస్పీ వినోద్కుమార్ చౌబేతో సహా 28 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరగడం గ మనార్హం












Click it and Unblock the Notifications