కాంగ్రెసుకు సత్తా దాసోహం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: మార్పు పేరిట లోక్‌ సత్తా ప్రజలను మభ్యపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికలకు ముందు మార్పు అన్న లోక్‌ సత్తా ప్రస్తుతం అధికార కాంగ్రెసు పార్టీకి వత్తాసు పలుకుతోందని, ఇదేనా వారు కోరుకునే మార్పు అని ఆయన అన్నారు. 'గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపు కోసం హైదరాబాద్‌ ను తామే ఏదో అభివృద్ధి చేసినట్లుగా కాంగ్రెస్‌పార్టీ దగాకోరు ప్రచారం చేస్తోంది. వాళ్ల ప్రచారం తీరు చూస్తుంటే నాటి చార్మినార్‌ను, నేటి హైటెక్‌సిటీని కూడా తామే కట్టామని చెప్పేలా ఉన్నారు. టీడీపీ హయాంలోనే నగరం అభివృద్ధి చెందింది. కాంగ్రెస్‌ ఐదేళ్లలో చేసింది శూన్యం. ఏదైనా చేశారనుకుంటే చర్చకు రమ్మని సవాల్‌ విసురుతున్నాను' అని ఆయన అన్నారు.

గ్రేటర్‌ ఎన్నికలకు సన్నాహకంగా ఆయన సోమవారం నగర శివార్లలోని శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సభల్లో ప్రసంగించారు. తామే హైదరాబాదును అభివృద్ధి చేశామని ఆయన చెప్పుకున్నారు. పేదలకు 60 గజాల భూమి ఇవ్వడానికి మనసురాకపోయినా పెద్దలకు కోట్ల విలువైన భూమిని అన్యాక్రాంతం చేశారన్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే కాంగ్రెస్‌ నేతలు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కందిపప్పు, బియ్యం, చక్కెర, నూనెలు, పప్పులు, కూరగాయలు - అన్నింటి ధరలు కాలుతున్నాయన్నారు. కంది పప్పు కోసం పంట వచ్చేవరకూ ఆగాలని సీఎం అంటే దొడ్డు బియ్యం తినాలని మరో మంత్రి చెబుతున్నారు. వచ్చే గ్రేటర్‌ ఎన్నికల్లో వీరికి ప్రజలు షాకి స్తేనైనా ఈ ధరల గురించి పట్టించుకుంటారేమో! వారిని గెలిపిస్తే కందిపప్పు రూ. 200, బియ్యం రూ. 60 కావడం ఖాయం అని హెచ్చరించారు. కాంగ్రెస్‌, ఎంఐఎంలకు బ్రేక్‌ పడితేనే నగరం బాగుపడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+