బాబు వద్ద పాఠాలా?: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని చంద్రబాబు చేసిన విమర్శకు ఆయన ప్రతిస్పందించారు. గిరిజనులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీలకు, ఎస్టీలకు తమ కాంగ్రెసు ప్రభుత్వం చేసినంత ఎవరూ చేయలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఏటా ఒకటిన్నర శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రపంచ బ్యాంకుకు రాసిచ్చారని, సర్వీసు కమిషనే వద్దాన్నారని, ఇప్పుడు గిరిజనులపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

తాము కొమురం భీం పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని గిరిజనులకు సేవలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజనులకు 9 లక్షల ఎకరాలు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చామని, వారికి రుణాలు కూడా కల్పిస్తామని, ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఎస్టీ, ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ విషయంలో గడువు దాటిన విషయం నిజమేనని, అందుకే సాధ్యమైనంత త్వరలో భర్తీ చేస్తామని మంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానానికి తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అడ్డు తగలడానికి పలు మార్లు ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+