వైయస్ కు శిక్షణ ఇస్తాం: బాబు

వైయస్ కు పునశ్చరణ తరగతులు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. గిరిజనులకు తమ ప్రభుత్వం హయాంలో కేటాయించిన నిధులను ఆయన చెప్పారు. గిరిజనుల ఆరోగ్యాన్ని, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సమయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఇద్దరు సీనియర్ నాయకులు, ఇరువురు 1978లోనే రాజకీయాల్లోకి వచ్చారు, ఇద్దరి మధ్య సారూప్యత ఉంది, ఇంతటితో ముగించండి అని ఆయన అన్నారు. దీంతో వాగ్వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications