ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయి గొంతు కోసిన ప్రేమోన్మాది

By Staff
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడంలేదనే కోపంతో రవి అనే యువకుడు మాధురి అనే బిటెక్ విద్యార్థిని గొంతు కోశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శనివారంనాడు జరిగింది. మాధురి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. మాధురి ఆళ్లగడ్డకు, నంద్యాలకు మధ్యన ఉన్న ఆల్ఫా కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది.

శనివారంనాడు మాధురి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్లి ఆంధ్రాబ్యాంకులో డబ్బులు తీసుకుని తిరిగి వస్తుండగా రవి ఎదురు పడ్డాడు. తనను ప్రేమించాలని అతను ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో అతను తన వద్ద ఉన్న బ్లేడుతో మాధురి గొంతు కోశాడు. మాధురి రక్తస్రావంతో పడిపోయింది. స్థానికులు ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. రవి అక్కడి నుంచి పారిపోయాడు.ఆల్ఫా కాలేజీ విద్యార్థులు ఆస్పత్రికి చేరుకున్నారు. రవిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని వారంటున్నారు.

మాధురి కుటుంబం నంద్యాలలో ఉంటుంది. వారి ఇంటి పక్కనే రవి కుటుంబం ఉంటుంది. గత కొన్నాళ్లుగా రవి తనను ప్రేమించాలని ఒత్తిడి తెస్తున్నట్లు, ఆమె అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. రవి తనను వేధిస్తున్న విషయాన్ని మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే శనివారంనాటి ఘాతుకం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X