రోశయ్యకు బాబు మాట సాయం

రాష్ట్రానికి వాటా ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవని, గ్యాస్ పై పూర్తి హక్కులు కేంద్రానికే ఉంటాయని, అయితే గ్యాస్ లో వాటా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రోశయ్య అన్నారు. గ్యాస్ లో వాటా అడగడమే కాకుండా రెవెన్యూలో వాటాను కూడా అడగాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కుంటోందని, రెవెన్యూలో వాటాను కూడా అడిగితే మనకు ప్రయోజనం ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. తాను చంద్రబాబు మాటలతో ఏకీభవిస్తున్నానని, కేంద్రంపై అందుకు ఒత్తిడి తెస్తామని రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications