హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబే మొదలు పెట్టారు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని, హైదరాబాదు శివారులోని భూముల అమ్మకాలను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల గృహనిర్మాణాల పథకంపై చర్చ సందర్భంగా ఆయన బుధవారం శాసనసభలో ఆ వ్యాఖ్య చేశారు. హైదరాబాదులోని, హైదరాబాదు శివారులోని భూములను ప్రభుత్వం అమ్ముతోందని విమర్శించడం సరి కాదని, ఈ అమ్మకాలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబే మొదలు పెట్టారని ఆయన అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, విమర్శల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మోసం చేస్తోందనే విమర్శలను ఆయన ఖండించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X