బెదిరించనక్కర లేదు: ధర్మాన

Dharmanna Prasad Rao
హైదరాబాద్: రాష్ట్రంలో కరవు ప్రాంతాలను ప్రకటించే విషయంలో తమను ఎవరూ బెదిరించనక్కర లేదని, ఎవరూ పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. కరవుపై జరిగిన చర్చకు ఆయన మంగళవారం శాసనసభలో సమాధానమిస్తూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరవు ప్రాంతాల ప్రకటన సాధారణంగా జరిగేదే అని ఆయన అన్నారు. వారంలోగా కరవు ప్రాంతాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరవు పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి గానీ తాను గానీ ఎప్పుడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళనగా ఉందని, కరవు ప్రాంతాలను ప్రకటించినంత మాత్రాన సహాయక చర్యలు చేపట్టకుండా ఉండే ప్రభుత్వం తమది కాదని ఆయన అన్నారు. కరవుపై ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+