వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నిర్ణయం విచారకరం: జస్వంత్

By Staff
|
Google Oneindia TeluguNews

Jaswant Singh
న్యూఢిల్లీ: తనను బహిష్కరిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం విచారకరమని మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. తనను బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో పార్టీ తనకు బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఫోన్ మీద తెలపడానికి బదులు ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు.

పుస్తకం రాసినందుకు తనను బహిష్కరించారని, ఆలోచనకు, రాతకు అవకాశం ఇవ్వని రాజకీయ ధోరణి ప్రోత్సహించదగింది కాదని ఆయన అన్నారు. తనను బహిష్కరించే విషయంలో పార్టీ పద్ధతులు పాటించలేదని ఆయన విమర్శించారు. తనకు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ వచ్చినట్లు ఆయన తెలిపారు. సిమ్లాకు రావద్దని తనకు ఢిల్లీలోనే చెప్పి ఉంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X