విశాఖపట్నం: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని కలిమెల బ్లాక్ ఎంబి 90లో ఓ మహిళను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఆమెను గొంతు కోసి హత్య చేశారు. ఇన్ ఫార్మ్రర్ నెపంతో ఆమెను నక్సలైట్లు చంపినట్లు సమాచారం. ఇటీవల ముగ్గురు మహిళా మావోయిస్టులు పోలీసుల చేతిలో హతమయ్యారు. పోలీసులకు ఆ మహిళ సమాచారం ఇవ్వడం వల్లనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టులు పలు చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు.