కాంగ్రెసుపై మజ్లీస్ గరం

ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో ఒక అనుబంధ ప్రశ్నకు అవకాశం ఇవ్వాలని తాము కోరామని, తమను సస్పెండ్ చేసిన తర్వాత గంటన్నర పాటు ఆ అంశంపైనే చర్చ జరిగిందని, తమకు అవకాశం ఇస్తే వచ్చే నష్టం ఏమిటో తమకు అర్థం కాలేదని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్ అయిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అక్బరుద్దీన్ ను కలిశారు. ఆయన సర్దిచెప్పినా అక్బరుద్దీన్ వినలేదని సమాచారం. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి కాంగ్రెసును ఓడిస్తామని ఆయన హెచ్చరినట్లు తెలుస్తోంది.
కాంగ్రెసును ఓడించడానికి అవసరమైతే ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలతో జత కట్టి మూడో ప్రత్యామ్యాయాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెసుకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ వస్తుంటే తమపై వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మజ్లీస్ ముఖ్యమంత్రి డాక్ట్ర వైయస్ రాజశేఖర రెడ్డికి బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. మజ్లీస్ కాంగ్రెసుకు దూరమైతే ఆ విషయంలోనే కాకుండా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి.












Click it and Unblock the Notifications