హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడ దాకా పోరాడుతాం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుడు టీవీ రామారావుపై అక్రమ కేసు బనాయించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రామారావును లొంగదీసుకునేందుకు ప్రభుత్వం రామారావుపై లైంగిక వేధింపుల కేసు బనాయించిందని ఆయన అన్నారు. టీవీరామారావుపై పెట్టిన కేసుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన అనంతరం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎదుట గల గన్ పార్క్ వద్ద ధర్నా చేసింది. ఈ ధర్నాలో సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేష్, సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.

రామారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రామారావుపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై కడదాకా పోరాడుతామని చంద్రబాబు చెప్పారు. ఈ విధంగా అక్రమ కేసు బనాయించడం దేశంలో ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తొండి ఆట ఆడుతున్నారని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రామారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే రామారావుపై కేసు పెట్టారని మల్లేష్ ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X