ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం ఉదంయ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కొత్తగూడెం మండలం వేపులగడ్డ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఖమ్మం నుంచి వెళ్తున్న లారీ ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను రాఘవాపురంలోని బంజరవాసులుగా పోలీసులు గుర్తించారు.