Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు నిర్వాకమే: చిరు

Chiranjeevi
కాకినాడ: తిరుమలలో అక్రమాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. కెజి బేసిన్ లో రాష్ట్ర వాటాను డిమాండ్ చేస్తూ పార్టీ తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ టెర్మినల్ వద్ద శనివారం తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల వ్యవహారాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమై కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.

శ్రీవారి నగల కుంభకోణంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాత్ర ఉందని, అందుకే ఆ వ్యవహారంపై శాసనసభలో చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఆ అంశంపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆయన అన్నారు. తిరుమల అక్రమాలను ప్రజాకోర్టులో వెల్లడిస్తామని ఆయన అన్నారు. కెజి బేసిన్ లో రాష్ట్ర వాటా సాధించేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. గ్యాస్ పై తాము తలపెట్టిన ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు. కెజి బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు బయట పడడం మన అదృష్టమని ఆయన అన్నారు. ప్రభుత్వం గ్యాస్ కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

కాకినాడ రైల్వే స్టేషనులో చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. చిరంజీవిని చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో రైల్వే స్టేషనులో తోపులాట చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+