కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్లె నిద్రలో కెసిఆర్ కు అస్వస్థత

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పల్లెనిద్ర కార్యక్రమానికి తెర పడింది. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతుండడంతో ఆయన కార్యక్రమాన్ని కుదించారు. కెసిఆర్ శనివారం బండలింగాపూర్ గ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటారు.

గత కొద్ది కాలంగా కెసిఆర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. తద్వారా తిరిగి పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన ఇప్పటికే పర్యటించారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X