కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు మరణించారు. కాకినాడలో జరిగే ప్రజారాజ్యం మహాధర్నాకు వస్తూ వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అప్పటికే కాకినాడ చేరుకున్నారు.
ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లాకుల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు కారులో ఇరుక్కుపోయినట్లు సమాచారం.