సాయంత్రం సోనియాతో కెవిపి భేటీ

KVP Ramachandar Rao
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వ్యవహారంలో చర్చించేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠాన వర్గం కెవిపిని ఢిల్లీకి పిలిపించింది. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటుస సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు జగన్ తరఫున వాదిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన సాగిస్తున్నారు. కెవిపి ఢిల్లీకి బయలుదేరే ముందు వైయస్ వర్గీయులు ఆయనను కలిశారు.

కాగా, జగన్ వ్యతిరేక వర్గం కూడా ఢిల్లీకి చేరుకుంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకూడదని ఒక బలమైన లాబీ రాష్ట్ర కాంగ్రెసులో పనిచేస్తూనే ఉన్నది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి పదవికి జగన్ ను ఏకపక్షంగా ఎంపిక చేయడం సులభం కాదు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్త నేత ఎంపిక జరగవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటన, ఆ ప్రకటన నేపథ్యంలో కాంగ్రెసు కార్యకర్తల గొడవ పరిస్థితిని విషమింపజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+