వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్: సోనియాతో మొయిలీ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.జగన్ కు మద్దతుగా వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించిన నేపథ్యంలో వారిద్దరు నేతలు జరిపారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇస్తే బాగుంటుందనే విషయాన్ని కెవిపితో సోనియా చర్చిస్తారని అంటున్నారు. ఒక వేళ జగన్ ను ముఖ్యమంత్రిని చేయలేని స్థితిలో కెవిపికి అనుకూలమైన నాయకుడినే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉంది.

జగన్ ను ముఖ్యమంత్రిని తాము పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవడం లేదని, అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని శిరసా వహిస్తామని రాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. తాము ప్రజాభిప్రాయాన్ని మాత్రమే అధిష్ఠానవర్గానికి వినిపిస్తున్నట్లు కాంగ్రెసు రాష్ట్ర ఎంపీల కన్నీనర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమది పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తెచ్చే పార్టీ కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవడం లేదని వైయస్ సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి అన్నారు. ప్రజల కోరిక మేరకు జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X