ఎవరినీ పిలిపించలేదు: మొయిలీ

కొత్త నేతను ఎన్నుకునే వరకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తానని కె. రోశయ్య చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై సిఐడి ప్రాథమిక నివేదిక ఇంకా రాలేదని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధలతో చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్య సోమవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వైన్ ఫ్లూపై సమీక్ష చేశారు. మంగళవారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications