తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాపై డిజిపి యాదవ్ గుర్రు

By Staff
|
Google Oneindia TeluguNews

SSP Yadav
తిరుపతి: మీడియాపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్ఎస్పీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు ఆయన శాపనార్థాలు పెట్టారు. ఆయన శనివారం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులపై శివాలెత్తారు. అవగాహన లేకుండా మీడియా వార్తలు రాస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన తప్పు పట్టారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో తనను బలిపశువును చేసేందుకు కొన్ని టీవీ చానెల్స్ ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకున్న మీడియా సర్వనాశనం అవుతుందని ఆయన అన్నారు. తిరుమల భద్రతకు ఆక్టోపస్ భద్రతా దళాన్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ కమాండో యూనిట్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ భద్రతా దళాన్ని తిరుమలలో మోహరించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X