మీడియాపై డిజిపి యాదవ్ గుర్రు

SSP Yadav
తిరుపతి: మీడియాపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్ఎస్పీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు ఆయన శాపనార్థాలు పెట్టారు. ఆయన శనివారం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులపై శివాలెత్తారు. అవగాహన లేకుండా మీడియా వార్తలు రాస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన తప్పు పట్టారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో తనను బలిపశువును చేసేందుకు కొన్ని టీవీ చానెల్స్ ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకున్న మీడియా సర్వనాశనం అవుతుందని ఆయన అన్నారు. తిరుమల భద్రతకు ఆక్టోపస్ భద్రతా దళాన్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ కమాండో యూనిట్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ భద్రతా దళాన్ని తిరుమలలో మోహరించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+