Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్సీపితో పొత్తుపై రేపు: దేశ్ ముఖ్

Vilasrao Deshmukh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపితో పొత్తును రేపు ఖరారు చేసుకోనున్నట్లు కాంగ్రెసు సీనియర్ నేత విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు. రేపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని, పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయం రేపు తేలుతుందని ఆయన అన్నారు.సోనియా గాంధీతో గంట సేపు చర్చలు జరిపిన అనంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ సుశీల్ కుమార్ షిండే కూడా ఉన్నారు.

దేశ్ ముఖ్ కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అందుకు ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీపితో పొత్తు పెట్టుకునే సందర్బంలో పార్టీకి తగినన్ని సీట్లు వచ్చేలా చూడాలని సోనియా తనకు సూచించినట్లు ఆయన తెలిపారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు 164 సీట్లకు, ఎన్సీపి 124 సీట్లకు పోటీ చేశాయి. ఈసారి కాంగ్రెసు ఎక్కువ సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల్లో ఎన్సీపి తగిన ఫలితాలు సాధించకపోవడం కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. ఎన్సీపికి ఎక్కువలో ఎక్కువ 110 సీట్లు ఇవ్వాలని కాంగ్రెసు ఆలోచిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+