జగన్ అయితేనే మంచిది: ఉప్పునూతల

సాంకేతిక కారణాల వల్లనే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని మరో కాంగ్రెసు నేత టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆయన విడిగా బుధవారం మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. అయితే జాప్యం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైయస్ కుటుంబమంటే కాంగ్రెసు, కాంగ్రెసు అంటే వైయస్ కుటుంబం అనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అనుభవజ్ఞుడని, రోశయ్య లేని క్యాబినెట్ ను ఊహించలేమని ఆయన అన్నారు. అయితే ప్రజాభిమానం మాత్రం జగన్ కే ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications