వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ రైలుపై రాళ్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న స్వర్ణ్ రైలుపై హర్యానాలోని పానిపట్ వద్ద దుండగులు రాళ్లు రువ్వారు. లూథియానా నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. సి -2, సి-4, సి-7 బోగీల అద్దాలు పగిలాయి. ఒక రాయి కోచ్ లోపల పడినట్లు సమాచారం. అయితే ఎవరికీ ఏ విధమైన గాయాలూ కాలేదు.

రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న మూడో నెంబర్ కోచ్ అద్దాలకు ఏ విధమైన నష్టం జరగలేదు. దీంతో పానిపట్ లో రైలును అపవద్దని రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రైలు సిబ్బందికి సూచించింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు విసిరింది చిన్న పిల్లలేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సుగల పిల్లలు ఆడుకుంటూ రాళ్లు వేశారని, అది దాడి కాదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X