కెవిపితో మామూలు మాటలే: రోశయ్య

తమ ప్రాధాన్యతల్లో కూడా స్వల్పంగా మార్చామని, అయితే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని, అయితే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని, తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదట స్వైన్ ఫ్లూపైనే సమీక్ష జరిపానని ఆయన చెప్పారు. అయితే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మీడియా సహకారం అవసరమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications