విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను సిఎం అనుకోరు: నారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

Narayana
విశాఖపట్నం: సచివాలయంలో సి - బ్లాక్ లో గల ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పని చేయనంత వరకు కె. రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎవరూ భావించబోరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. కరువు దాడి కేసులో కోర్టు హాజరు కావడానికి శనివారం ఇక్కడికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే సి - బ్లాక్ నుంచి పనిచేయాల్సిందేనని, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. సి - బ్లాక్ నుంచి రోశయ్య ఎందుకు పని చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కరువు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా గోదాముల్లో దాచిన నిల్వలను పట్టించినా అధికారులు వాటిపై కేసులు నమోదు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని, ఇలాంటి స్థితిలో ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని గల్లీలు తప్ప నాగేందర్ కు రాష్ట్రంలోని వివరాలు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కు మధ్య సమన్వయం లేదని ఆయన తప్పుపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X