జగన్ సభకు శోభనాగి రెడ్డి

శోభా నాగిరెడ్డి జగన్ సభకు హాజరు కావడాన్ని హైదరాబాదులోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు తేలికగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు జగన్ ను పరామర్శించడానికి మాత్రమే వచ్చారని, అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. వారు పార్టీని వీడిపోరని అంటున్నారు. అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి పార్టీ సహకారం అందించాలని శోభానాగిరెడ్డి వంటి శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్న విషయం కొత్తదేమీ కాదు. శోభానాగిరెడ్డి, మరి కొంత మంది జగన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి వెనకాడడం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications