వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం, 15మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Heavy Rains
హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలకు ఇప్పటివరకూ 15మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రోశయ్య గురువారం సచివాలయంలో సంబంధిత మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారికంగా ప్రకటించారు.

అనంతరం ఆ వివరాలను ధర్మాన మీడియాకు వివరిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. అలాగే మరో వారంలో కరువు మండలాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీరు రావటంతో మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.

వరద నీటిని చెరువులు, రిజర్వాయర్‌లకు విడుదల చేయనున్నట్లు ధర్మాన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వరద సహాయక చర్యలకు జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X